<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

భారతంలో గాంధారం

Wednesday, March 5, 2008

చిన్నప్పుడు దుర్యోధనుడు భీముణ్ణి తరచూ "కుండకా1! కుశలమేనా?" అని సంబోధించి ఎగతాళి చేసేవాడట. ఉడుకుబోతైన భీముడు చాలా రోజులు ఊరుకున్నా ఒకసారి మాత్రం తిరగబడి "కుశలమే గోళకా2!" అని ఘాటుగా సమాధానమివ్వడంతో దిమ్మతిరిగిపోయిన దుర్యోధనుడు అప్పుడేమీ మాట్లాడలేక ఊరుకున్నా అసలు తను గోళకుడెందుకయ్యాడా అని ఇన్వెస్టిగేట్ చేయిస్తాడు. (నేను చిన్నప్పుడు బాలమిత్రలో చదివిన ఈ కథ ఇంతవరకూ కల్పితమేమో గానీ ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడినట్లుగా చెప్తున్నది మాత్రం భారతంలో ఉన్న కథే:) గాంధారదేశానికి (ఇప్పటి ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ ప్రాంతం) రాజైన సుబలుడికి కూతురు (గాంధారి) పుట్టగానే ఆమె జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కులు "ఆమె జాతకంలో వైధవ్యయోగముంది" అని చెప్పారు. దాంతో ఆ యోగాన్ని తప్పించడానికి ఆమెకు యుక్తవయస్సు రాగానే ముందు రహస్యంగా ఒక మేకపోతుతో పెళ్ళి జరిపించి, వెంటనే దాన్ని చంపేసి ఆమెను శాస్త్రోక్తంగా విధవను చేశారు. ఆ తర్వాత ఆ విషయాన్ని దాచిపెట్టి దూరదేశాన ఉన్న కురువంశానికి చెందిన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్ళి చేసి పంపేశారు. అలా కౌరవులు విధవాపుత్రులన్నమాట.

ఈ విషయం తెలియగానే తన తాత కురువంశాన్ని మోసం చేశాడని మండిపడ్డ దుర్యోధనుడు తాత, మేనమామలను భూగృహంలో బందీలుగా చేసి, రోజుకు ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు మాత్రమే ఆహారంగా అందివ్వమంటాడు. (సరిగా గుర్తులేదుగానీ సుబలుడికి కూడా వందో, ఇంకా ఎక్కువమందో ఉన్నారు కొడుకులు.) అలా ఐతే నిజంగానే అందరమూ అన్యాయంగా చచ్చిపోతామని గ్రహించిన సుబలుడు ఆ మెతుకులన్నీ శకుని ఒక్కణ్ణే తినమని, తను చచ్చిపోయాక మహిమగల తన అస్థికల సాయంతో దుర్యోధనుడి మీద పగతీర్చుకోమని చెప్తాడు. అలా వారిలో శకుని ఒక్కడే బతికి బయటపడి దుర్యోధనుడికి నమ్మకం కలిగించి కృష్ణుడి అండ ఉండే పాండవుల మీదికి అతణ్ణి రెచ్చగొట్టి అతడి పతనానికి కారకుడయ్యాడు. బహుశా మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణుడికి ప్రియదర్శినిలో శకుని కనిపించింది ఇందుకేనేమో? జరాసంధుడి తర్వాత దుర్యోధనుడే కదా కృష్ణుడి ఆధిపత్యానికి అడ్డుగా నిలిచింది? మిగతావాళ్ళను కృష్ణుడు స్వయంగా నిర్మూలించగలిగాడు గానీ వీళ్ళిద్దరి విషయంలోనే పాండవుల సాయం అవసరమైంది.

1. కుండకుడు = bastard!
2. గోళకుడు = విధవాపుత్రుడు

Labels: ,

posted by త్రివిక్రమ్ Trivikram, 1:50 PM | link | 6 comments |