నారదుని పూర్వజన్మ వృత్తాంతం
Tuesday, May 8, 2007
నారదుడు పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడు. బాల్యదశలోనే (అయిదేళ్ళ వయస్సు)వర్షశరదృతువుల్లో చాతుర్మాస్య దీక్ష తీసుకున్న వేదవేత్తలయిన మునుల సేవ కోసం అతని తల్లి నియోగించింది.ఆ బాలుడు బాల్య చాపల్యం లేకుండా, ఆటపాటల జోలికి పోకుండా, మితభాషియై, అన్నన్య చిత్తముతో సేవించాడు. వారు తినగా మిగిలిన పదార్థాలను భుజించాడు. వారు ప్రతి నిత్యమూ గానం చేసే శ్రీకృష్ణ కధామృతాన్ని మూడు పూటలా ఆస్వాదించాడు. దయాసముద్రులైన ఆ మునుల కాటాక్షం చేతనూ, శ్రీకృష్ణ కథాశ్రవణమ్ చేతనూ అతనిలో నిశ్చలమైన కృష్ణభక్తి ఏర్పడింది. పాపాలు నశించాయి.
అజ్ఞానం తొలగిపోయింది. అతనిలోని సత్వ రజస్తమొ గుణాలు అంతరించాయి. దీక్షానంతరం మునులు వెళ్లిపోతూ సాక్షాత్తు భగవంతుని చేత ఉపదేశించబడిన దివ్యజ్ఞానాన్ని అతనికి ఉపదేశించారు. ఆ ఉపదేశాన్ని అనుష్ఠించడం వల్ల శ్రీకృష్ణుని మాయా ప్రభావాన్ని చక్కగా తెలుసుకున్నాడు. ఆ మునులు వెళ్ళిపోయిన తర్వాత అతడు తల్లి సంరక్షణలోనే ఉంటూ ఆమె పనిచేసే బ్రహ్మణుల ఇళ్ళలో నివసించేవాదు. ఒక రోజు రాత్రిపూట అతని తల్లి పాముకాటుకు బలై మరణించింది. ఆ సంఘటనను ఈశ్వర సంకల్పంగా భావించి, నిర్వికారంగా ఉత్తర దిశగా ప్రయాణమై వెళ్ళాడు. జనపదాలు, నగరాలు, గ్రామాలు, వనాలు, పర్వతాలు, సరస్సులు దాటి ఒక భయంకరమైన అడవిలోకి ప్రవేశించాడు. సుదీర్ఘ ప్రయాణం వల్ల అలసట చెందిన అతడు ఒక నదిలో హాయిగా స్నానం చేసి ఆ నదీజలాన్ని పానం చేసి దాహం తీర్చుకొన్నాడు.
నిర్మానుష్యమైన అడవిలో ఒక రావిచెట్టు కింద కూర్చుని భగవంతుని పాదపద్మాలను ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి శ్రీహరి ఆని హృదయంలో లీలగా గోచరించాడు.అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది. శరీరం పులకించింది. ఆ ఆనందమగ్న స్తితిలో తన్ను తానుగానీ, ఆ భగవనుడినిగానీ చూడలేకపోయాడు.(ఇది ధ్యాత్పధ్యేయ భేదరహితమైన స్థితి). ఆ వెంటనే భగవద్రూపం అదృశ్యమైంది. ఇష్ట వస్తువును కోల్పోయినట్టుగా అతడి మనసు కలత చెందింది. మళ్ళీ ఏకాగ్ర చిత్తంతో ధ్యానించినా ఆ రూపం కనపడలేదు. బాధతో కుమిలిపోతుండగా మధుర గంభీర స్వరముతో శ్రీహరి మాటలు వినపడ్డాయి."నాయనా! ఈ జన్మలో నా దర్శనం లభించే అర్హత నీకింకా కలగలేదు. కోర్కెలన్నింటినీ పూర్తిగా జయించని సాధకులు నా దర్కనభాగ్యం పొందలేరు. నీకు నాయందున్న అనురక్తిని వృద్ధి చెయ్యాలనే సంకల్పంతోనే నీకు క్షణకాలం నా రూపదర్శనమిచ్చాను.దాని ద్వారా నీ భక్తి దృడమవుతుంది. ఈ దేహాన్ని విడిచిన పిమ్మట నువ్వు నా అనుచరుడివవుతావు. ప్రళయ సమయంలో సైతం నీకు నా అనుగరహం వల్ల పూర్వ స్మృతి లభిస్తుంది"
అంతట నారదుడు ఆ శ్రీహరి నామాన్నే స్మరిస్తూ, ఆయన లీలావిశేషాలు కీర్తిస్తూ, ఏ కోరికలు లేనివాడై, వినమ్రుడై భూలోకమంతా పర్యటించాడు. అలా పర్యటిస్తూ ఉండగా అతడి ప్రారబ్ద కాలం పూర్తయ్యింది. శరీరం పతనమైంది. ఆ తరువాత కల్పాంతంలో మహావిష్ణువు సమస్త ప్రపంచాన్ని ఉపసమ్హరించి మహా సముద్రం మధ్య నిద్రిస్తూ ఉండగా ఆయనలో నిద్రించడానికి ప్రవేశిస్తున్న బ్రహ్మదేవుని శ్వాసతో పాటు నారదుడు కూడా నారాయణుని ఉదరంలోనికి ప్రవేశించాడు. అలా సహస్తయుగాలు గడిచిపోయాయి. సృష్టి కార్యం కోసం బ్రహ్మ నిద్ర లేచాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి అత్రి, మరీచి మొదలీన ఋషులతో పాటు నారదుడూ అవరరించాడు. అప్పటినుండి శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో దేవదత్తమైన మహతి వీణను మీటుతూ హరికథాగానం చేస్తూ ముల్లోకాలలోనూ నిరాటంకంగా సంచరిస్తున్నాడు.
అజ్ఞానం తొలగిపోయింది. అతనిలోని సత్వ రజస్తమొ గుణాలు అంతరించాయి. దీక్షానంతరం మునులు వెళ్లిపోతూ సాక్షాత్తు భగవంతుని చేత ఉపదేశించబడిన దివ్యజ్ఞానాన్ని అతనికి ఉపదేశించారు. ఆ ఉపదేశాన్ని అనుష్ఠించడం వల్ల శ్రీకృష్ణుని మాయా ప్రభావాన్ని చక్కగా తెలుసుకున్నాడు. ఆ మునులు వెళ్ళిపోయిన తర్వాత అతడు తల్లి సంరక్షణలోనే ఉంటూ ఆమె పనిచేసే బ్రహ్మణుల ఇళ్ళలో నివసించేవాదు. ఒక రోజు రాత్రిపూట అతని తల్లి పాముకాటుకు బలై మరణించింది. ఆ సంఘటనను ఈశ్వర సంకల్పంగా భావించి, నిర్వికారంగా ఉత్తర దిశగా ప్రయాణమై వెళ్ళాడు. జనపదాలు, నగరాలు, గ్రామాలు, వనాలు, పర్వతాలు, సరస్సులు దాటి ఒక భయంకరమైన అడవిలోకి ప్రవేశించాడు. సుదీర్ఘ ప్రయాణం వల్ల అలసట చెందిన అతడు ఒక నదిలో హాయిగా స్నానం చేసి ఆ నదీజలాన్ని పానం చేసి దాహం తీర్చుకొన్నాడు.
నిర్మానుష్యమైన అడవిలో ఒక రావిచెట్టు కింద కూర్చుని భగవంతుని పాదపద్మాలను ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి శ్రీహరి ఆని హృదయంలో లీలగా గోచరించాడు.అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది. శరీరం పులకించింది. ఆ ఆనందమగ్న స్తితిలో తన్ను తానుగానీ, ఆ భగవనుడినిగానీ చూడలేకపోయాడు.(ఇది ధ్యాత్పధ్యేయ భేదరహితమైన స్థితి). ఆ వెంటనే భగవద్రూపం అదృశ్యమైంది. ఇష్ట వస్తువును కోల్పోయినట్టుగా అతడి మనసు కలత చెందింది. మళ్ళీ ఏకాగ్ర చిత్తంతో ధ్యానించినా ఆ రూపం కనపడలేదు. బాధతో కుమిలిపోతుండగా మధుర గంభీర స్వరముతో శ్రీహరి మాటలు వినపడ్డాయి."నాయనా! ఈ జన్మలో నా దర్శనం లభించే అర్హత నీకింకా కలగలేదు. కోర్కెలన్నింటినీ పూర్తిగా జయించని సాధకులు నా దర్కనభాగ్యం పొందలేరు. నీకు నాయందున్న అనురక్తిని వృద్ధి చెయ్యాలనే సంకల్పంతోనే నీకు క్షణకాలం నా రూపదర్శనమిచ్చాను.దాని ద్వారా నీ భక్తి దృడమవుతుంది. ఈ దేహాన్ని విడిచిన పిమ్మట నువ్వు నా అనుచరుడివవుతావు. ప్రళయ సమయంలో సైతం నీకు నా అనుగరహం వల్ల పూర్వ స్మృతి లభిస్తుంది"
అంతట నారదుడు ఆ శ్రీహరి నామాన్నే స్మరిస్తూ, ఆయన లీలావిశేషాలు కీర్తిస్తూ, ఏ కోరికలు లేనివాడై, వినమ్రుడై భూలోకమంతా పర్యటించాడు. అలా పర్యటిస్తూ ఉండగా అతడి ప్రారబ్ద కాలం పూర్తయ్యింది. శరీరం పతనమైంది. ఆ తరువాత కల్పాంతంలో మహావిష్ణువు సమస్త ప్రపంచాన్ని ఉపసమ్హరించి మహా సముద్రం మధ్య నిద్రిస్తూ ఉండగా ఆయనలో నిద్రించడానికి ప్రవేశిస్తున్న బ్రహ్మదేవుని శ్వాసతో పాటు నారదుడు కూడా నారాయణుని ఉదరంలోనికి ప్రవేశించాడు. అలా సహస్తయుగాలు గడిచిపోయాయి. సృష్టి కార్యం కోసం బ్రహ్మ నిద్ర లేచాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి అత్రి, మరీచి మొదలీన ఋషులతో పాటు నారదుడూ అవరరించాడు. అప్పటినుండి శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో దేవదత్తమైన మహతి వీణను మీటుతూ హరికథాగానం చేస్తూ ముల్లోకాలలోనూ నిరాటంకంగా సంచరిస్తున్నాడు.
5 Comments:
మీరిచ్చే పురాణ గాధలు చాలా చాలా బాగున్నాయి. మా లాంటి వారి కోసం వీటన్నింటినీ ఇంత ఓపికగా బ్లాగుతున్నందుకు సంతోషంగా ఉంది.
commented by
Naveen Garla, May 8, 2007 at 7:03 PM

నాదో సందేహం నారదుడు శ్రేక్రిష్ణావతారానికి ముందు లేడా?
బహుశా శ్రే హరి గురించి అయి వుంటుంది.
Aa krishnaavataaram veroka mahaa yougaaniki sambhandinchinadi.. ee yugaanidi kaadu... Inka clear gaa.. adi veroka kalpaaniki sambandhinchina charitra... Please correct me if I am wrong.. :-)
జ్యోతి గారు నారదుడు గురించి మీరు వ్రాసింది ఏపురాణం నుండి???, నాకు సరిగా జ్ఞాపకం లేదు నేను ఏ పురాణం నుండి చదివానో కాని నారదుడు బ్రహ్మ కుమారుడు , దక్షుడు వల్ల శాపం పొంది మళ్ళి జన్మ ఎత్తుతాడు. నేను చదివిన పురాణం మళ్ళి నెమరు వేసి నారదుడు గురించి బ్లాగుతాను